నా బ్లాగులో ప్రస్తావించిన మూడు (అన్ని) ప్రతిపాదనలూ శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనల్లో పొందుపరచబడ్డాయి. (ప్రాంతీయ మండలి, కేంద్రపాలితప్రాంతం చేసి రెండు వేర్వేరు రాజధానులు, భౌగోళిక సవరణలతో సంయుక్త రాజధాని)
ప్రతిపాదనలు-
• రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, ప్రత్యేక బోర్డుల ఏర్పాటు
• రాష్టాన్ని రెండుగా విభజించడం, హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా చేసి వేర్వేరు రాజధానులు ఏర్పాటు
• రాష్టాన్ని రాయల తెలంగాణ గా ఆంధ్ర గా విడగొట్టడం
• నల్గొండ, హైదరాబాదు, రంగారెడ్డి లతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాతు చేసి ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం
• హైదరాబాదు రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (సీమాంధ్ర ప్రజల్లో అనుమానాలు నివృత్తిచేసిన పిమ్మట)
• రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం, ప్రాంతాలవారీగా రాజ్యాంగ రక్షణ కల్పించడం
My Analysis-
• 1 మరియు 6 వ సిఫారసులు సమైక్యవాదాన్ని బలపరుస్తాయి
• మిగిలిన అన్ని సిఫారసులు ప్రత్యేకవాదాన్ని బలపరుస్తాయి
• అందరి వాదాలనీ పరిగణన లోకి తీసుకున్నారు
•ఆరుప్రతిపాదనల్లో ఐదుప్రతిపాదనలు హైదరాబాదు ని సీమాంధ్ర తో అనుసంధానిస్తూ హైదరాబాదుని ఎవరికీ పరిమితం చేయలేమని స్పష్టంగా చెప్పారు
• హైదరాబాదుతో సీమాంధ్ర ప్రజలకున్న అనుబంధాన్ని, Dependancy ని స్పష్టంగా గుర్తించారు
ముందుగా ప్రకటించిన విధంగా -- ముందుగా మొదటి సిఫారసు అమలుచేయడానికి ప్రయత్నిస్తారు, సాధ్యంకాకపోతే రెండవది, తర్వాత మూడవది.
కనుక ..
• రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఇక సాధ్యం కాదు గనుక మొదటి సిఫారసు ఆచరణీయంకాదు
• హైదరాబాదు పై స్పష్టమైన ప్రకటన్ లేకుండా రాష్ట్రాన్ని విభజించడం సాధ్యంకాదు గనుక రెండవదీ సాధ్యంకాదు
• మూడవ ప్రతిపాదన రాయల్ తెలంగాణ వెనుక రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి కానీ, అది ఏ రకంగానూ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబించడం లేదు
• ఇక ఐదు, ఆరు ప్రతిపాదనలైన సమైక్య రాష్ట్రం, ప్రత్యేకరాష్ట్రం ఏకాభిప్రాయం కుదరదు గనుక ఏ విధంగానూ సాధ్యంకాదు
• సో, నాలుగవ సిఫారసు అయిన , హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ లతో కలిపి కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేయడం అనే సిఫారసు బహుశా ఆచరణ యోగ్యం కావచ్చు, ఈ ప్రతిపాదనకి (రాష్ట్రవిభజనకు మానసికంగా సిద్ధమైన) సీమాంధ్ర నుండీ పెద్ద ప్రతిఘటన ఎదురుకాదు, కానీ ప్రత్యేకవాదులు సంతృప్తి చెందరు.
అందరినీ సంతృప్తి పరచడం సాధ్యంకాదు గనుక, అందరికీ సమానంగా అసంతృప్తి కలిగించే పరిష్కార మార్గం మాత్రమే ముందు కనిపిస్తోంది. ప్రత్యేకరాష్ట్రం కావలంటే ఈ ప్రతిపాదనకి ప్రత్యేకవాదులు దిగిరాక తప్పదు.
కానీ మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాదు, రంగారెడ్డి నాలుగు జిల్లాలు తరలిపోతే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది, ఆరుజిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత, నాయకత్వ లేమి, వెరసి ఝార్ఖండ్ లాంటి పరిస్థ్జితి పునరావృతమౌతుంది, అసలే వెనుకబడి ఉన్న ఐదు జిల్లాలతో కుడిన తెలంగాణ రాష్ట్రం మావోయిస్టులకి స్వర్గధామం అవుతుంది, దీర్ఘకాలం లో తెలంగాణ నష్టపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, కొత్తగా ఏర్పడబోయే వాణిజ్య, ఉపాధి అవకాశాలు. చిన్న రాష్ట్రాల్లో ఉన్న పరిపాలనా సౌలభ్యాలూ, ప్రతిపాదిత కేంద్రపాలిత ప్రాంతంలో Infrastructure Development, అవకాశాలూ, వాణిజ్య పరమైన అభివృద్ధి, ఈ ప్రతిపాదనలోని అనుకూలాంశాలు.





